పాపం.. మళ్లీ ఎదురుచూడక తప్పేలా లేదు !

పాపం.. మళ్లీ ఎదురుచూడక తప్పేలా లేదు !

Published on Mar 31, 2019 5:11 PM IST

నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ‘భీష్మ‌’కి సంబంధించిన పోస్ట‌ర్‌ తో పాటు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం మళ్లీ ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

నితిన్ ప్రస్తుతం చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి సినిమాలో నటించనున్నాడు. ఆ సినిమా పూర్త‌య్యాకే ‘భీష్మ‌’ చిత్రం మొదవవుతుందని తెలుస్తోంది. దీంతో పాపం భీష్మ మళ్లీ ఎదురుచూడక తప్పేలా లేదు.

ఇక ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తి అయింది. ‘ఛలో’ మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. నితిన్ లాస్ట్ సినిమా శ్రీనివాస కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో నితిన్, భీష్మ చిత్రం పై మరింత దృష్టి పెట్టారు.

ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు