కాశ్మీర్ లో ‘వెంకీ మామ’ ఏకంగా 250 మందితో !

కాశ్మీర్ లో ‘వెంకీ మామ’ ఏకంగా 250 మందితో !

Published on Jun 6, 2019 12:05 AM IST

‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వెంకీ – చైతు కాంబినేషన్ లో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. కాగా ఈ చిత్రం షూటింగ్ రెండు వారాల నుంచి, కాశ్మీర్ లో చిత్రీకరిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ షూట్ లో దాదాపు 250 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొంటున్నారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తుండటంతో అంతమంది ఆర్టిస్ట్ లు కావాల్సి వచ్చారట.

ఇక జూన్ 13న ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. అయితే తరువాత షెడ్యూల్ హైదరాబాద్ లో గ్యాప్ లేకుండా షూట్ చేయనున్నారు. ఈ హైదరాబాద్ షెడ్యూల్ తో సినిమాలో కీలక భాగం పూర్తవుతుంది. గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు.

దాంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది. కాగా ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు