‘వెంకీ మామ’ లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్ !

‘వెంకీ మామ’ లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్ !

Published on Jul 1, 2019 3:02 PM IST

‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వెంకీ – చైతు కాంబినేషన్ లో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. కాగా ఈ చిత్రం 25 రోజుల పాటు కాశ్మీర్ లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ షూట్ లో దాదాపు 250 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు తరువాత షెడ్యూల్ ను వైజాగ్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో వెంకటేష్ – నాగచైతన్యల పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించన్నారు.

ఈ షెడ్యూల్ తో దాదాపు సినిమా 75 శాతం వరకు పూర్తవుతుందట. ఇక గతంలో ‘ప్రేమమ్’ సినిమాలో కొద్దిసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న మామ అల్లుళ్లు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా పై అందరిలోనూ ఆసక్తి అమాంతం పెరిగింది. ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు