ప్రీ రిలీజ్ ఈవెంట్ సిద్దమవుతున్న ప్రతిరోజూ పండుగే టీం

ప్రీ రిలీజ్ ఈవెంట్ సిద్దమవుతున్న ప్రతిరోజూ పండుగే టీం

Published on Dec 13, 2019 2:27 PM IST

యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సారి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్నాడు. ఫన్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ కలిసి ప్రతిరోజూ పండుగే చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని చివరి దశకు చేరుకున్న తాతగారికి ఒక మనవడు కుటుంబం సహాయంతో ఎలా సెండ్ ఆఫ్ ఇచ్చాడు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. సాయి ధరమ్ తేజ్ కి జంటగా రాశి ఖన్నా నటిస్తుండగా, సత్య రాజ్ కీలక రోల్ చేస్తున్నారు.

ప్రతి రోజు పండుగే విడుదలకు ఇంకా వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. క్రిస్మస్ కానుకగా ఈనెల 20న విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ భారీగా ప్రొమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో చిత్ర యూనిట్ బస్ యాత్ర చేస్తూ అభిమానులను కలుసుకుంటున్నారు. కాగా ఈనెల 15న ఈమూవీ ప్రీ రిలీజ్ వేడుక భారీ ఎత్తున నిర్వహించనున్నారు. హైదరాబాద్ మాదాపూర్ నందు గల ఐటీసీ కోహినూర్ వేదికగా సాయంత్రం 6గంటల నుండి ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. మరి ఈ వేడుకకు మెగా హీరోలలో ఎవరు అతిధిగా రానున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు