పింక్ రీమేక్ లో మెరవనున్న బాలీవుడ్ హీరోయిన్ ?

పింక్ రీమేక్ లో మెరవనున్న బాలీవుడ్ హీరోయిన్ ?

Published on Dec 9, 2018 8:48 PM IST

‘విశ్వాసం’ తరువాత తమిళ స్టార్ హీరో తల అజిత్ ‘పింక్’ రిమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ అతిధి పాత్రలో నటించనుందని కోలీవుడ్ కథనం. బోనీ కపూర్ , జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని ‘శతురంగ వెట్టై , ధీరన్ అదిగారం ఒండ్రు’ చిత్రాల దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక 2016 లో విడుదలైన ఈ పింక్ విమర్శకుల ప్రశంసలు పొంది 100 కోట్ల ను కలెక్ట్ చేసింది. అమితాబ్ బచ్చన్, తాప్సి పన్ను ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా పింక్ రీమేక్ లో అజిత్ , అమితాబ్ పోషించిన పాత్రలో కనిపించనున్నాడు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు