పిరియాడిక్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ !

పిరియాడిక్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ !

Published on Jan 18, 2021 12:00 PM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ కాంబినేషన్ లో ఎవ్వరూ ఊహించని విధంగా పాన్ ఇండియా సినిమాని ప్రకటించారు. కాగా ఈ సినిమా నేపథ్యం గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమా పిరియాడిక్ మూవీ అని, పాకిస్తాన్ – ఇండియా విడిపోయిన కాలంలో జరిగిన అప్పటి పరిస్థుతుల ఆధారంగా జరిగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది.

అలాగే పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగిన యుద్ధం… ఆ యుద్ధంలో ఇండియా గెలుపు కోసం ఒక జవాన్ ఎంత గొప్పగా పోరాటం చేశారనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. ఆ జవాన్ పాత్రలోనే విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో దాదాపు 150 కోట్ల బడ్జెట్లో నిర్మించనున్నారు. సుకుమార్ ‘పుష్ప’ సినిమా పూర్తవ్వగానే ఈ సినిమా మొదలుకానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు