క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయబోతున్న సినిమా ఈ రోజు ఓపెనింగ్ కార్యక్రమం జరుపుకుంది. ఈ సినిమాలో విజయ్ సరసన రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసాబెల్లె డి ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రాంతి మాధవ్ తనకు అచ్చు వచ్చిన ఫ్యూర్ లవ్ స్టోరీతోనే ఈ సినిమాను కూడా రూపొందిస్తున్నారట.
కాగా సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ చాలా వైవిధ్యంగా ఉంటుందని.. ముగ్గురు హీరోయిన్లకు విజయ్ కు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్.రామరావు నిర్మిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండతో ఇటీవలే ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి పాటలందించిన గోపీసుందర్ నే ఈ చిత్రానికి కూడా స్వరాలనందిస్తున్నారు.