కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న భారీ ప్రతిష్టాత్మ చిత్రం !

కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న భారీ ప్రతిష్టాత్మ చిత్రం !

Published on May 26, 2022 8:02 PM IST

స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో 66వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ప్రస్తుతం జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ నేటితో పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్‌లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు ఈ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొన్నారు. చాలా మంది నటీనటులు సెట్స్‌కి వచ్చి షూట్‌లో పాల్గొనడంతో, ప్రతిరోజూ ఒక పండగలా షూటింగ్ జరిగింది. 25 రోజుల పాటు చిత్రీకరించిన ఈ భారీ షెడ్యూల్‌ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు