రాజ్ కిరణ్ దర్శకత్వంలో నందితరాజ్, సత్యం రాజేశ్, అశుతోష్ రాణా ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వామిత్ర’. ఈ చిత్రాన్ని మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం టైటిల్ లోగోను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో నటుడు అశుతోష్ రాణా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా టాలెంట్ ఉంది. ఇక్కడివారు వివిధ విభాగాలను చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు. ఇక నందిత రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో నేను పొసెసివ్ భర్త పాత్రలో కనపడతాను. రాజ్కిరణ్గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పనిచేసిన ఎంటైర్ యూనిట్కి అభినందనలు” అన్నారు.
ఈ చిత్ర దర్శకుడు రాజ్కిరణ్ మాట్లాడుతూ ‘ఒక నిజ ఘటనను ఆధారంగా ఓ సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకునేవాడిని. అది ఇప్పటికి తీరింది. యు.ఎస్లో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ ఆర్టికల్ చదివి దాన్ని ఆధారంగా చేసుకుని ఈ కథను తయారు చేసుకున్నాను. అలాగే ఇలాంటి ఘటనే స్విజర్లాండ్లో కూడా జరిగిందని విన్నాను. అలా యు.ఎస్, స్విజ్జర్లాండ్ ఘటనల ఆధారంగా ఈ స్క్రిప్ట్ తయారు చేశాను. మాధవిగారు. రజనీకాంత్ గారు నిర్మాతలుగా ఈ సినిమా చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది హీరోయిన్స్ కథ చెప్పాను. బావుంది.. హీరో ఎవరు అని అడిగారు. సత్యం రాజేశ్ అని చెప్పగానే చాలా మంది డ్రాప్ అయ్యారు. కానీ నందితరాజ్ కథ వినగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆమెకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. నా మిత్రుడు వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాకు మాటలను అందించారు. అలాగే మరో స్నేహితుడు బి.వి.ఎస్.రవిగారి సహకారం కూడా మరువలేనిది” అన్నారు.
సత్యం రాజేశ్ మాట్లాడుతూ ‘రాజ్ కిరణ్ ఓ రోజు ఫోన్ చేసి ఈ సినిమాలో నువ్వే హీరో అని అన్నారు. కథ పరంగా నాది హీరో క్యారెక్టర్ కాదు. కానీ ప్రాముఖ్యత ఉన్న పాత్ర. నాకంటే అశుతోష్ రాణాగారు.. నందితగారు, మల్లిక్గారు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో కనపడతారు. అలాగే ఈ సినిమాకు మాటలు అందించిన వంశీకృష్ణగారికి థాంక్స్” అన్నారు. హీరోయిన్ నందితరాజ్ మాట్లాడుతూ ‘చాలా మంచి కథ. ఈ కథ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. అయితే రాజ్కిరణ్, మాధవిగారు, రజనీకాంత్గారు థాంక్స్” అన్నారు.
ఈ చిత్ర నిర్మాత నిర్మాత మాధవి మాట్లాడుతూ ‘కథ వినగానే బాగా నచ్చడంతో సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చేసేశాం. యు.ఎస్, స్విజర్లాండ్లో జరిగిన యదార్ధ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదొక థ్రిల్లర్ లవ్ స్టోరీ. తెలుగు సినిమాల్లో రాని కథాంశంతో వస్తోన్న సినిమా అని తెలిపారు.