రామమందిర నిర్మాణానికి రూ.5 కోట్లు ఇచ్చిన స్టార్ హీరో?

రామమందిర నిర్మాణానికి రూ.5 కోట్లు ఇచ్చిన స్టార్ హీరో?

Published on Aug 8, 2020 11:47 AM IST

దశాబ్దాలుగా సాగుతున్న అయోధ్య వివాదానికి ముగింపు పలికిన బీజేపీ ప్రభుత్వం రామ మందిర నిర్మాణానికి మరియు మసీదు నిర్మాణానికి వేరువురుగా స్థలాలు కేటాయించింది. ఇక రామ మందిర నిర్మాణానికి కేటాయించిన భూమిలో ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. కోట్ల వ్యయంతో రామ మందిరం అద్భుతంగా ప్రభుత్వం నిర్మించనుంది.

కాగా రెండు రోజులుగా ఓ వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. కింగ్ ఖాన్ షారుక్ రామ మందిర నిర్మాణం కోసం ఏకంగా రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారట. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని అందరూ విశేషంగా చెప్పుకుంటున్నారు. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. రామ మందిర నిర్మాణ కమిటీ కానీ, షారుక్ ఖాన్ కానీ ఈ విషయంపై స్పందించలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు