షెడ్యూల్ పూర్తి చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ !

షెడ్యూల్ పూర్తి చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ !

Published on Dec 12, 2019 11:25 PM IST

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌గా రాబోతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కాగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఏరియాలో జరుగుతున్న షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. వారం రోజులు పాటు షూటింగ్ జరుపుకున్న ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించారు. విజయ్ దేవరకొండతో పాటు ఇతర ప్రధానమైన నటీనటులు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు.

ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న లవర్స్ డే రోజున ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం రాశీఖ‌న్నా మొదటసారి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుతుంది. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

కాగా విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ ఆశించిన విజయం సాధించలేక పోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. మొత్తానికి టైటిల్ బాగా క్యాచీగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు