గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అంజలి అలాగే కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన రీసెంట్ పొలిటికల్ యాక్షన్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న అంచనాలు అందుకోలేదు. అయితే ఈ సినిమా థియేటర్స్, ఓటిటి రిలీజ్ తర్వాత ఇపుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అయ్యింది.
ఈ సినిమా శాటిలైట్ హక్కులు జీ5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో డేట్ సమయం ఖరారు అయ్యాయి. ఈ ఏప్రిల్ 27 సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి ఈ చిత్రం ప్రసారం కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆల్రెడీ మాస్ ప్రమోషన్స్ కూడా ఆఫ్ లైన్ లో స్టార్ట్ చేయడం విశేషం. మరి ఇవన్నీ బుల్లితెరపై గేమ్ ఛేంజర్ కి ఎలాంటి రెస్పాన్స్ ని అందిస్తాయో చూడాలి.