సింగిల్ షెడ్యూల్లో ముగియనున్న వైఎస్సార్ బయోపిక్ !

సింగిల్ షెడ్యూల్లో ముగియనున్న వైఎస్సార్ బయోపిక్ !

Published on Jun 19, 2018 3:50 PM IST

దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డిగారి జీవితం ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ ‘యాత్ర’ పేరుతో బయోపిక్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డిగారి పాత్రను పోషించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ముగించిన టీమ్ రేపటి నుండి షూటింగ్ మొదలుపెట్టనుంది.

ఈ షెడ్యూల్ సెప్టెంబర్ వరకు ఏకధాటిగా జరగనుంది. ఈ ఒక్క షెడ్యూల్లోనే చిత్రీకరణ మొత్తాన్ని ముగించేస్తారట. వైఎస్ 2003లో చేపట్టిన 60 రోజుల పాదయాత్ర, ఆయన పరిపాలన, మడమ తిప్పని వ్యక్తిత్వం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందనుంది.

కొంత కాలం క్రితమే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న సినిమాను రాజశేఖర్ రెడ్డిగారి ఇమేజ్ కు ఏమాత్రం తక్కువ కాకుండా తెరకెక్కిస్తామని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు