ఇటీవల వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన దక్షిణాది రాష్ట్రం కేరళకు ఇంకా విరాళాలు అందుతూనే వున్నాయి. తాజాగా మలయాళ యువ నటుడు నివిన్ పౌలి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసి 25లక్షల చెక్ ను విరాళం గా అందజేశారు. ‘ప్రేమమ్’ చిత్రంతో మలయాళీ తెరకు పరిచయమైన నివిన్ అనతికాలంలోని స్టార్ హోదా ను సొంతం చేసుకున్నాడు.
ఇక వర్షాలతో దెబ్బతిన్న కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. వరదలతో దాదాపుగా 14రోజులు మూతపడిన కొచ్చి ఎయిర్ పోర్ట్ ఎట్టకేలకు మళ్లీ ఈరోజు తెరుచుకుంది.
