కోనసీమలో ‘దంగల్’ డైరెక్టర్

కోనసీమలో ‘దంగల్’ డైరెక్టర్

Published on May 30, 2017 3:18 PM IST


బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ చిత్రం దంగల్ బాహుబలి ప్రభంజనాన్ని దాటిపోయింది. ఈ చిత్రం కలెక్షన్లు బాహుబలిని మించిపోతూ రూ 1675 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా అవతరించింది. దంగల్ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహించారు.

కాగా నితీష్ తివారి 3 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ ని కోనసీమ ఏరియాలో చిత్రీకరించడానికి ఆంధ్ర వచ్చారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నితీష్ మీడియాతో మాట్లాడారు. ఇక్కడ పచ్చదనంతో కూడుకున్న అందమైన ప్రకృతి ఎంతగానో నచ్చిందని పేర్కొన్నారు. ఓ సందేశాత్మక స్టార్ ఫిల్మ్ ని ఇక్కడ చిత్రీకరించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఓ తండ్రి తన కుమార్తె వివాహం తరువాత కూడా ఆమె చదువు గురించి ఆలోచించేలా ఈ షార్ట్ ఫిల్మ్ ఉంటుందని అన్నారు.బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ కి చెందిన భాస్కర్ రెడ్డి ఈ షార్ట్ ఫిల్మ్ ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు