ఎం.ఎస్.ధోని.. భారతదేశంలో క్రికెట్ తెలిసిన ప్రతివ్యక్తికీ పరిచయం ఉన్న పేరు. భారత క్రికెట్కు తిరుగులేని విజయాలను అందించిన ధోని జీవిత కథతో బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే, ‘ఎం.ఎస్.ధోని – ది అన్టోల్డ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ధోనీ పాత్రలో నటించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా కోట్లల్లో ఉన్న ధోనీ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేశారు.
ఇక మొదట్నుంచీ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా దేశవ్యాప్తంగా ఉదయం షోస్కు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు సినిమా పలు రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనీ సినిమాకు ఇదే స్థాయి రెస్పాన్స్ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా హైద్రాబాద్లో ఈవారాంతం మొత్తం టికెట్స్ అమ్ముడవ్వడం సినిమాకు తెలుగులోనూ ఏ రేంజ్ క్రేజ్ ఉందో స్పష్టం చేస్తోంది.
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తిరుగులేని శక్తిగా ధోని ఎలా ఎదిగాడు అన్న కథాంశంతో తెరకెక్కిన ధోనీలో దిశా పఠాని, భూమిక కీలక పాత్రల్లో నటించారు.