బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన పేరడీ సినిమా ’కొబ్బరి మట్ట’ కొద్దిరోజులుగా టీజర్తో హల్చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవిని సైతం మెప్పించిన ఈ టీజర్ యూట్యూబ్లో రికార్డు వ్యూస్ సాధిస్తూ సంపూర్ణేష్ బాబు సినిమాకు ఉన్న క్రేజ్ను బయటపెట్టింది. ఇక ఈ టీజర్కు వచ్చిన రెస్పాన్స్ చూశాక, డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకునేందుకు మంచి ఆసక్తి కనబరుస్తున్నారు. యూఎస్లో ఈ సినిమా పంపిణీ హక్కులను అక్కడి ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సుమారు 30 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది.
సంపూర్ణేష్ బాబు సినిమాకు యూఎస్లో ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడమంటే విశేషమనే చెప్పుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ అవకాశాలు వస్తాయని టీమ్ భావిస్తోంది. రోనాల్డ్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొబ్బరి మట్ట’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్లో సంపూర్ణేష్ నిమిషం పాటు ఓ డైలాగ్ను చెప్పడం అందరినీ ఆకర్షించింది. ఇందులో పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు అన్న మూడు పాత్రలతో సంపూర్ణేష్ సందడి చేయనున్నారు.