పవన్ – వెంకీల ‘గోపాల గోపాల’లో మధుశాలిని

పవన్ – వెంకీల ‘గోపాల గోపాల’లో మధుశాలిని

Published on Aug 18, 2014 8:49 AM IST

Madhu-Shalini2
విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని నానక్రాం గూడాలో వేసిన ఓ సెట్లో శరవేగంగా జరుగుతోంది. వెంకటేష్ ఓ మిడిల్ క్లాస్ షాప్ ఓనర్ గా కనిపించనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ శ్రీ కృష్ణుడిగా కనిపించనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం హైదరాబాదీ అమ్మాయి అయిన మధు శాలిని ఈ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. మధు శాలిని ఇందులో వచ్చే ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. మధు శాలిని చేస్తున్నది చిన్న పాత్రే అయినా సినిమాకి మాత్రం చాలా కీలకం అని చిత్ర బృందం అంటోంది. మధు శాలిని ప్రస్తుతం తన పార్ట్ కి సంబందించిన షూటింగ్ లో పాల్గొంటోంది.

కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రియ శరన్ నటిస్తోంది. డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్ గా తెలుగులో ‘గోపాల గోపాల’గా 2015 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు