మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఎం.ఎల్.ఏ’ !

మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఎం.ఎల్.ఏ’ !

Published on Mar 24, 2018 9:44 AM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘ఎం.ఎల్.ఏ’. నిన్న శుక్రవారం భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఓపెంనింగ్స్ రాబట్టింది. ఇక ఈరోజు రేపు వీకెండ్ కావడం వలన ఈ వసూళ్ళు ఇలానే కొనసాగే అవకాశాలున్నాయి. మాస్ సెంటర్లలో చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది.

కళ్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఉపేంద్ర మాధవ్ డైరెక్ట్ చేయగా భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇకపోతే ఏప్రిల్ నెలాఖరు నుండి సినిమాటోగ్రఫర్ గుహన్ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టనున్న కళ్యాణ్ రామ్ మే 25న ‘నా నువ్వే’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు