‘పొగ’లో అతిధి పాత్ర చేయబోతున్న శ్రీను వైట్ల

‘పొగ’లో అతిధి పాత్ర చేయబోతున్న శ్రీను వైట్ల

Published on Mar 3, 2012 3:30 PM IST

శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ‘పొగ’ చిత్రంలో శ్రీను వైట్ల అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. ‘రైన్బో’ మరియు ‘పరమ వీర చక్ర’ చిత్రాల తరువాత శ్రీను వైట్ల అతిధి పాత్రలో కనిపించబోయే మూడవ చిత్రం ఇదే. శ్రీను వైట్ల కి సంభందించిన సన్నివేశాలు నిన్న చిత్రీకరించారు. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణధీర్, బిందు మాధవి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా సౌమ్య మరో పాత్రలో నటిస్తుంది. మహేష్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దూకుడు భారీ విజయం తరువాత శ్రీను వైట్ల అగ్ర దర్శకుల వరుసలో చేరిపోయారు. త్వరలో ఆయన ఎన్టీఆర్ మరియు కాజల్ తో ఒక సినిమా తీయబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు