‘మిస్సమ్మ’ తరహాలో నాగ్ – ఎన్టీఆర్ సినిమా..!

‘మిస్సమ్మ’ తరహాలో నాగ్ – ఎన్టీఆర్ సినిమా..!

Published on Aug 29, 2014 3:00 PM IST

nagarjuna-ntr

కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి ఒక సినిమాలో నటిస్తారన్న ప్రచారం ఎప్పటి నుండో జరుగుతుంది. ‘ఎవడు’తో హిట్ కొట్టిన దర్శకుడు వంశి పైడిపల్లి వీరిద్దరికీ సెట్ అయ్యే అద్భుతమైన కథను రెడీ చేశారు. ‘రభస’ తర్వాత ఈ సినిమా ప్రారంభమవ్వాలి. అయితే ఎన్టీఆర్ పూరి జగన్నాధ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టడంతో ఈ మల్టీస్టారర్ సినిమా ఉండదని అంతా భావించారు. వీటికి చెక్ పెట్టారు కింగ్ నాగార్జున. పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా విశేషాలు వెల్లడించారు.

తారక్, నేను కలసి చేయబోయే సినిమా చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్. వంశి పైడిపల్లి అద్బుతమైన కథ చెప్పారు. చాలా కొత్తగా ఉంటుంది. ఎన్టీఆర్, ఏన్నార్ నటించిన ‘మిస్సమ్మ’ తరహాలో సినిమా ఉంటుంది. మీమిద్దరం స్నేహితులుగా నటిస్తున్నాం. అని నాగార్జున చెప్పారు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత తెలుగులో అగ్ర హీరోలు కలసి నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అక్కినేని త్రయం ‘మనం’లో మెరిశారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’లో సందడి చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు