రానా – తేజాల కలయికలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా నడుస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లోను డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన మొత్తాన్ని వెనక్కి తెచ్చి లాభాల్లోకి కూడా తీసుకెళుతోంది. ఈ సినిమాతో తేజ మరోసారి వెలుగులోకి రాగా రానాకు సోలో హీరోగా భారీ విజయం దక్కింది. ఇక యూఎస్ లో సైతం సినిమాకు భారీ ప్రేక్షకాదరణ దక్కుతోంది. మొదటి వారం నైజాంలో రూ. 5.27 కోట్లు, సీడెడ్లో రూ.1.91 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ.13.42 కోట్లు రాబట్టింది. ఈ కలెక్షన్లను ఏరియాల వారీగా చూసుకుంటే
ఏరియా | కలెక్షన్లు |
నైజాం | 5. 27 కోట్లు |
సీడెడ్ | 1.91 కోట్లు |
నెల్లూరు | 46 లక్షలు |
గుంటూరు | 1. 21 కోట్లు |
కృష్ణా | 1.16 కోట్లు |
వెస్ట్ | 71 లక్షలు |
ఈస్ట్ | 1.13 కోట్లు |
వైజాగ్ | 1.57 కోట్లు |
మొత్తం | 13.42 కోట్లు |