‘శ్రీమంతుడు’ అడ్వాన్స్ బుకింగ్ కి సూపర్బ్ క్రేజ్

‘శ్రీమంతుడు’ అడ్వాన్స్ బుకింగ్ కి సూపర్బ్ క్రేజ్

Published on Aug 3, 2015 9:55 AM IST

Srimanthudu
మరో నాలుగు రోజులు మాత్రమే.. దేనికి అనుకుంటున్నారా.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ రిలీజ్ కావడానికి.. మహేష్ బాబు – కోరల శివ కాంబినేషన్ లో ఆగష్టు 7న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే శ్రీమంతుడు సినిమా టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి ఈ సినిమాకి సంబందించిన ఆన్ లైన్ బుకింగ్ ని మొదలు పెట్టారు. బుకింగ్ ఓపెన్ చేసిన కొంత సమయానికే దాదాపు 80% థియేటర్స్ లో ఫస్ట్ వీకెండ్ మొత్తానికి హౌస్ ఫుల్ పెట్టేసారు. మిగిలిన థియేటర్స్ టికెట్స్ కి కూడా ఫుల్ క్రేజ్ నెలకొంది.

ప్రస్తుతం అభిమానులంతా మొదటి రోజు సినిమా చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమా టికెట్స్ కోసం భారీగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు అండ్ టీం అన్ని టీవీ చానల్స్, పేపర్స్, మిగిలిన మీడియా వారికి స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉంది. ఇప్పటికే దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఆల్బంలోని సాంగ్స్ రీసెంట్ చార్ట్ బస్టర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. మహేష్ బాబు ఈ సినిమాతో ఓ సూపర్ సోషల్ మెసేజ్ ని ఆడియన్స్ మెచ్చే కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పడానికి ట్రై చేసాడు. ఇంకా మెయిన్ సిటీస్ లోని మల్టీ ప్లెక్సుల్లో టికెట్స్ బుకింగ్ ఓపెన్ కావాల్సి ఉంది. వాటి కోసం కూడా ఫాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

శ్రీమంతుడు సినిమా తమిళంలో సెల్వందన్ గా రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ ఆడియో ఔగుత్ 4న చెన్నైలో జరగనుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు