‘అందాల రాక్షసి’ లాంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో హను రాఘవపూడి దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా తర్వాత రానా దగ్గుబాటితో ‘కవచం’ సినిమా చెయ్యడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమాకి రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ రానా ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వలన హను సినిమాకి సమయం కేటాయించలేకపోతున్నాడు.
ఇన్ని రోజులు వేచి చూసిన హను రాఘవపూడి రానా డేట్స్ అడ్జస్ట్ చేసే లోపు మరో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. అందుకోసం సందీప్ కిషన్ ని హీరోగా ఎంచుకున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి – సందీప్ కిషన్ సినిమా చర్చల దశలో ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.