ట్విట్టర్‌ను వదిలేసి వెళ్ళిపోతున్న తారలు!

ట్విట్టర్‌ను వదిలేసి వెళ్ళిపోతున్న తారలు!

Published on Jan 17, 2017 2:38 PM IST

trisha-vishal
ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా అన్నది సాధారణ మనిషి నుంచి సెలెబ్రిటీల వరకూ అందరికీ ఓ అవసరంగా మారిపోయింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సినీ తారలంతా తమ అభిమానులతో సినిమాల గురించి, తమ వ్యక్తిగత జీవితం గురించి పంచుకోవడానికి సోషల్ మీడియానే వేదికగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ సోషల్ మీడియాలోని సైట్లలో ఒకటైన ట్విట్టర్ అన్నది ఇండియన్ సినిమాలోని టాప్ స్టార్స్ అంతా వాడుతూ వస్తోన్న మాధ్యమం. తెలుగులోనూ ఈ వేదికపైనే హీరోలంతా తమ సినిమా విశేషాలను పంచుకుంటూ వస్తున్నారు.

తాజాగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు ఉన్న తారలైన త్రిష, విశాల్ తమ ట్విట్టర్ ఎకౌంట్‌లను వదిలేసి వెళ్ళిపోయారు. జల్లికట్టు వివాదంలో ఇరుక్కొని కొందరి చేత తీవ్ర విమర్శలు ఎదుర్కోవడంతో త్రిష ట్విట్టర్ ఎకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశారు. ట్విట్టర్‌ను వేదికగా చేసుకొనే కొందరు తనను టార్గెట్ చేయడంతో అక్కణ్ణుంచి వెళ్ళిపోతున్నట్లు ఆమె తెలిపారు. ఇక తాజాగా హీరో విశాల్ తన ట్విట్టర్ ఎకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశారు. ట్విట్టర్‌లో అంతా నెగటివిటీ ఉందని, విమర్శలు శృతిమించడంతో ఆయన ఈ వేదికనుంచి బయటకు వెళ్ళినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు