తెలుగు, తమిళ భాషల్లో కొద్ది కాలంగా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించుకుంటూ వెళుతూ పీవీపీ సంస్థ ఒక ప్రత్యేకత చాటుకుంటోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రహ్మోత్సవం, ఘాజీ, ఊపిరి, క్షణం.. ఇలా వరుసగా సినిమాలను నిర్మిస్తోన్న పీవీపీ, త్వరలో ఓ పెద్ద మల్టీస్టారర్తో ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. పదిమంది హీరోయిన్లతో ఒక భారీ మల్టీస్టారర్ను నిర్మించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తైందని సమాచారం.
సినిమాలో ప్రతీ ఒక్క క్యారెక్టర్కూ ఓ ప్రాధాన్యత ఉంటుందట. దీంతో ఈ పది పాత్రలకూ స్టార్ హీరోయిన్స్నే ఎంపిక చేయాలనేది పీవీపీ టీమ్ ప్లాన్. అందుకు తగ్గట్లే ప్రస్తుతం పలువురు స్టార్స్తో చర్చలు జరుపుతున్నారట. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఒకే సినిమాలో ఏకంగా పదిమంది హీరోయిన్స్ కలిసి నటించడమంటే అది అతిపెద్ద విశేషమే అవుతుందని చెప్పొచ్చు.