ప్రతినాయకుడిగా నటించాలని ఉందంటున్న యువ హీరో !

ప్రతినాయకుడిగా నటించాలని ఉందంటున్న యువ హీరో !

Published on Jun 25, 2017 11:00 AM IST


తెలుగు పరిశ్రమలోని ప్రస్తుత యువ హీరోలు కేవలం హీరోలుగా మాత్రమే కాక అప్పుడప్పుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటించి నటులుగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. అలాంటి వాళ్లలో హీరో హవీష్ కూడా ఒకరు. ‘నువ్విలా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హవీష్ చేసిన ‘జీనియస్’ చిత్రంతో ఆకట్టుకుని ఆ తర్వాత ‘రామ్ లీల’ సినిమా కూడా చేశారు.

ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మంచి కథ కోసం ఎదురుచూసిన అయన ఆ తరవాత నూతన దర్శకుడు సాయి శ్రీరామ్ చెప్పిన కథ నచ్చడంతో కొత్త సినిమా మొదలుపెట్టారు. రమేష్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘నిన్ను వదిలి నేను పోలేనులే’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమాలో హవీష్ సరసన ఐదుగురు కథానాయికలు నటిస్తున్నారు. నిన్న శనివారం పుట్టినరోజు సందర్బంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడిన హవీష్ ఇకపై కథను నమ్మే సినిమా చేస్తానని, ఇప్పుడు చేస్తున్నది కూడా మంచి కథ ఉన్న సినిమానే, బుధవారం నుండి షూటింగ్ మొదలవుతుంది అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు