ఫోటో మోమెంట్ : ‘డబుల్ ఇస్మార్ట్’ సెట్స్ లో రామ్, పూరి జగన్నాథ్

ఫోటో మోమెంట్ : ‘డబుల్ ఇస్మార్ట్’ సెట్స్ లో రామ్, పూరి జగన్నాథ్

Published on Apr 20, 2024 8:00 PM IST

యువ నటుడు రామ్ పోతినేని హీరోగా ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డబల్ ఇస్మార్ట్. ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకున్న ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మి నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

విషయం ఏమిటంటే ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ నుండి హీరో పూరి జగన్నాథ్ తో కలిసి హీరో రామ్ కూర్చుని సరదాగా మాట్లాడుతున్న పిక్ ఒకటి రిలీజ్ అయి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. పార్ట్ 1 ని మించేలా మరింత యాక్షన్ అంశాలతో దర్శకుడు పూరి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జూన్ 14న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, పూరి జగన్నాథ్ తొలిసారిగా మెగాఫోన్ పడుతూ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన బద్రి మూవీ రిలీజ్ అయి నేటికి 24 ఏళ్ళు పూర్తి అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు