సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్న వెంకీ !

Venkatesh
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు చిత్రంతో విక్టరీ వెంకటేష్‌ హీరోగా తెలుగుతెరకు పరిచయమయ్యారు. కాగా వెంకీ నటుడిగా కెరీర్ ను మొదలు పెట్టి నేటితో 32 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వెంకీ తనను ఇన్నేళ్లు ఆదరించిన అభిమానులకు తన పేస్ బుక్ పేజీ ద్వారా కృతజ్ఞతలు చెప్పిన విషయం తెలిసిందే.

ఐతే ఫేస్ బుక్ లో ఇప్పటికే చురుగ్గా ఉన్న వెంకీ, తాజాగా ఇన్స్టాగ్రామ్ యాకేంట్ ను ఓపెన్ చేసారు. ప్రస్తుతం వెంకీ ఖాతాను ఆయన అభిమానులు అనుకరించటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

Exit mobile version