బాపు పుస్తకాలకు భలే గిరాకీ

బాపు పుస్తకాలకు భలే గిరాకీ

Published on Sep 8, 2014 8:05 PM IST

bapu
ఒక ప్రముఖ వ్యక్తి మననుండి దూరమయినప్పుడు వారి గురించి తెలుసుకోవాలి ప్రజలకు ఆసక్తి కలగడం సర్వసాధారణం. కొన్ని రోజుల క్రితమే బాపుగారు చివరి శ్వాసను విడిచి తెలుగు ప్రజలను శోకసంద్రంలో ముంచారు

ఇప్పుడు ఆయన గొప్పతనాన్ని అర్ధంచేసుకునే క్రమంలో బాపు గారి పుస్తకాలకు చాలా గిరాకీ పెరిగింది. చిన్నా పెద్దా తేడా లేకుండా బాపుగారి పుస్తకాలను సేకరించడంలో నిమఘ్నమయ్యారు. పుస్తకాలే కాక బాపు గారి పెయింటింగ్ లకు సైతం డిమాండ్ పెరిగింది

బాపుగారి చిత్రరామాయణం ఎనలేని ఆదరణ పొందింది. భారతీయత ఉట్టిపడేలా ఆయన ఎన్నో పుస్తకాలు రచించారు

తాజా వార్తలు