దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన “ఝుమ్మంది నాదం” చిత్రం ద్వారా 2010 లో తెలుగు వెండితెరకు పరిచమైన సొట్టబుగ్గల పంజాబీ సుందరి తాప్సీ. తన అందంతో యువతను ఆకర్షించిన తరువాత పలు సినిమాల్లో నటించినా సోలోగా మంచి మంచి బ్రేక్ రాలేదు. మిస్టర్ పర్ఫెక్ట్ తో ప్రభాస్ సరసన మెరిసినా, సాహసం లో గోపీచంద్ సరసన నటించినా అవేవీ తన కెరీర్ ని గొప్ప స్థాయికి చెర్చలేకపోయాయి.
ఇక లాభం లేదనుకొని బాలీవుడ్ పైన తన దృష్టిని పెట్టి “చష్మె బద్దూర్” తో బాలీవుడ్ లో పాగా వేసింది. ఈ మధ్య సందీప్ కిషన్ సరసన ఓ సినిమా, యష్ చోప్రా బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు హల్చల్ చేయడంతో ఇటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని తన ట్విట్టర్ ద్వారా తను చేస్తున్న సినిమాల వివరాలను తెలియచేసింది. తను ఇప్పుడు కేవలం రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నానని అందులో ఒకటి “ఘజి” (తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఉంటుంది), రెండవది రైజింగ్ సన్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఇంకా పేరు పెట్టని సినిమాలో నటిస్తున్నానని తెలియచేసి తను నటిస్తున్న సినిమాల పైన వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది.
For all the speculations and source stories, I'm right now on for #Ghazi and an untitled movie under #RisingSunFilms ONLY *period*
— taapsee pannu (@taapsee) February 9, 2016