“ఇష్క్” చిత్ర దర్శకుడయిన విక్రం కుమార్ నాగార్జున కలల చిత్రం మూడు తరాలు కలిసి నటించబోయే చిత్రంకి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వర రావు ,నాగార్జున మరియు నాగ చైతన్య ఇలా మూడు తరాలు తెర మీద కనిపించబోతున్న ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో నాగార్జున ఈ చిత్రానికి కథలు వింటున్నాం అని చెప్పారు. ఆయనకు కథలు చెప్పిన వారిలో విక్రం కుమార్ ఒకరు ఇష్క్ చిత్ర కథానాయకుడు నితిన్ చూచాయిగా ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించాబోతున్నారని చెప్పారు. ట్విట్టర్ లో నితిన్ ఇలా పేర్కొన్నారు ” నా చిత్ర దర్శకుడు విక్రం కుమార్ తరువాతి చిత్రం మల్టీ స్టారర్ చిత్రం ఈ చిత్రంలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు కనిపించడం నాకు చాలా ఆనందం కలిగిస్తున్న విషయం” అని చెప్పారు. నితిన్ ఈ ట్వీట్ లో అక్కినేని కథానాయకుల గురించి ప్రస్తావించకపోయినా పరిశ్రమ వర్గాల ప్రకారం ఈ ట్వీట్ అక్కినేని వంశానికి సంభందించిన విషయమే . ఇష్క్ చిత్ర విజయం తరువాత విక్రం కుమార్ ఈ చిత్రం చెయ్యటం మూలాన చిత్రం మీద మరిన్ని అంచనాలు పెంచుతాయి. అధికారిక ప్రకటన త్వరలో చేయనున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- లేటెస్ట్…గూస్ బంప్స్ తెప్పిస్తున్న “పుష్ప పుష్ప” సాంగ్!
- ఓ రేంజ్ హైప్ ఇస్తున్న “పుష్ప 2 ది రూల్” ఫస్ట్ సింగిల్ లేటెస్ట్ పోస్టర్!
- సర్ప్రైజింగ్ : ఈ 14 భాషల్లో ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “హీరామండి”
- రజినీ “కూలీ”.. మేకర్స్ కి షాకిచ్చిన ఇళయరాజా
- “లవ్ టుడే” హీరో నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్!
- తారక్, నీల్ భారీ ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్
- ‘ఐపీఎల్ 2024’ లో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ యాడ్ ప్రమోషన్