అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మళయాలంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్’కు రీమేక్ అయిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కానుంది. ఇక సెన్సార్ పూర్తైన వెంటనే సినిమాను చూసిన కింగ్ నాగార్జున చాలా హ్యాపీగా ఉన్నారట. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేస్తూ తెలుగు ప్రేమమ్ చూశానని, సినిమా చూశాక ఇప్పుడు ఇంటికి సంతోషంగా వెళుతున్నానని నాగార్జున అన్నారు.
నాగ చైతన్యకు స్టార్డమ్ తీసుకొచ్చే సినిమాగా ప్రేమమ్ నిలుస్తుందని నాగార్జున కూడా మొదట్నుంచీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్స్లో కూడా ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. ‘కార్తికేయ’తో పరిచయమైన దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో నాగ చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. వెంకటేష్, నాగార్జున గెస్ట్ రోల్ చేయడం ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. రేపట్నుంచి సినిమాను వినూత్న పద్ధతిలో ప్రమోట్ చేయాలని టీం ప్లాన్ చేస్తోంది.
I just watched The telugu #premam/going back home so very happy!!:blush::clap::bouquet:
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 27, 2016