‘జీఎస్టీ’ వెబ్ సిరీస్ తో పలు వివాదాలకు కారణమైన వర్మ దీనికి సంబందించిన కేసులోనే పోలీసుల విచారణను ఎదుర్కుంటున్నారు. జీఎస్టీ విడుదల సమయంలో పలు టీవీ చానెళ్ల డిబేట్లకు హాజరైన వర్మ ఆ సమయంలో తనపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక కార్యకర్త దేవి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు పిర్యాదు చేసింది.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వర్మను విచారణకు పిలవగా నాగార్జునతో ముంబై షూటింగ్లో బిజీగా ఉండటం వలన రాలేకపోవడం వలన ఈరోజు తన న్యాయవాదితో కలిసి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు వర్మ. భారీ బందోబస్తు నడుమ పోలీసులు ఆయన్ను విచారిస్తున్నట్టు సమాచారం. మరి ఈ వివాదం నుండి వర్మ ఎలా బయటపడతారో చూడాలి.