జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈనెల 15న ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఫై భారీ కవాతును నిర్వహించనున్నారు. ఈ కవాతు కు సుమారు లక్ష మంది పైగా హజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
ఇక ఈ కవాతు ఫై ఒక సాంగ్ ను కంపోజ్ చేశాడు ప్రముఖ యువ సంగీత దర్శకుడు తమన్. రామజోగయ్య శ్రాస్తి లిరిక్స్ అందించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ 2001లో ‘ఖుషి’ సినిమాలోని ‘ఏ మేర జహ’ అనే సాంగ్ కంపొజిషన్ విషయంలో తమన్ కీలక పాత్ర పోషించాడని మళ్ళీ ఇప్పుడు జనసేన కవాతు సాంగ్ ను ఆయన కంపోజ్ చేశారని పవన్ గుర్తుచేసుకున్నారు.


