మహర్షిలో విలన్ ఎవరంటే ?

మహర్షిలో విలన్ ఎవరంటే ?

Published on Nov 24, 2018 10:52 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ఒక భారీ సెట్ లో జరుగుతుంది. ఇక ఈచిత్రంలో విలక్షణ నటుడు సాయి కుమార్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారని సమాచారం. గతంలో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘ఎవడు’ చిత్రంలో విలన్ గా నటించి ఆ పాత్రను రక్తికట్టించారు సాయి కుమార్. దాంతో వంశీ మళ్ళీ ఈ చిత్రానికి కూడా ప్రతినాయకుడిగా ఆయన్నే తీసుకున్నారట.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు,అశ్వినీ దత్ , పివిపి లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు