‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న దర్శకుడు ‘వేణు ఉడుగుల’, ఇప్పుడు ఈయన తన రెండో చిత్రంగా రానా, సాయిపల్లవిలను హీరోహీరోయిన్ లుగా పెట్టి ‘విరాటపర్వం’ అనే రాజకీయ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు వేణు. ఇక జులై నుంచి సెట్స్ పైకి వెళ్లుంది.
కాగా ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో టబు నటించనున్నట్లు తెలుస్తోంది. నాగార్జున సరసన నిన్నే పెళ్లాడతాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఆమే. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో టబు మానవ హక్కుల నేతగా నటిస్తోందట. ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వేణు ‘నీది నాది ఒకే కథ’ చిత్రంలో కూడా హీరో క్యారెక్టర్ మీదే చిత్రాన్ని నడిపించాడు. అలాగే ఈ సినిమాలోనూ రానా క్యారెక్టరే హైలెట్ గా నిలుస్తోందట.