‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు ‘వేణు ఉడుగుల’, కాగా ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా రానా, సాయిపల్లవిలను హీరోహరోయిన్ లుగా పెట్టి ‘విరాటపర్వం’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే.
పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై నుండి షూట్ కి వెళ్ళనుంది. కాగా ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో టబు నటించనున్నట్లు తెలుస్తోంది. టబు మానవ హక్కుల నేతగా నటిస్తోందట.
ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఇక వేణు ‘నీది నాది ఒకే కథ’ చిత్రంలో కూడా హీరో క్యారెక్టర్ మీదే చిత్రాన్ని నడిపించాడు. అలాగే ఈ సినిమానూ రానా క్యారెక్టర్ పైనే నడుపుతాడట.
రానా పాత్రలో కొంత నెగిటివ్ యాంగిల్ ఉంటుందని అది సినిమాలో కొత్తగా అనిపిస్తోందని దర్శకుడు ఫీల్ అవుతున్నాడట. ఇకపోతే ఇందులో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.