రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. హై వోల్టేజ్ యాక్టన్ సన్నివేశాలతో మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగా పర్వాలేదనిపించినా, ఆశించిన విజయం సాధించలేక పోయింది. ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఐతే టెలివిజన్ ప్రసారాలలో మాత్రం ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకోవడం విశేషం.
ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న స్టార్ మా గత నెల13న సాయంత్రం ప్రసారం చేయగా 8.1 టీఆర్పీ దక్కించుకుంది. ఐతే రెండవ సారి మధ్యాహ్నం ఈనెల 17న ప్రసారమైన ఈ చిత్రం ఆశ్చర్యకరంగా ఫస్ట్ స్లాట్ కి మించి 8.2 రేటింగ్ దక్కించుకొని అందరికి షాక్ ఇచ్చింది. కొన్ని సినిమాలలో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి ఇష్టపడక పోవడం వలన నష్టాలతో ముగుస్తున్నాయి అనడానికి ఇదే నిదర్శనం.


