మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం’సూపర్ మచ్చి’. కాగా ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. కరోనా సెకెండ్ వేవ్ రాకపోయి ఉండి ఉంటే.. ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేసేవాళ్ళు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఆహాలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. కాగా పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
హీరో హీరోయిన్లు కల్యాణ్దేవ్, రచితా రామ్తో పాటు ఒక కీలక పాత్రలో అజయ్ ఈ సినిమాలో నటిస్తోన్నాడు. ఇక కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. మరి ‘కళ్యాణ్ దేవ్’ పులి వాసు దర్శకత్వంలో చేస్తోన్న ఈ రెండువ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.