“వీరసింహా రెడ్డి” షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే.!

“వీరసింహా రెడ్డి” షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ఇదే.!

Published on Oct 27, 2022 3:00 PM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో ఓ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే గ్రాండ్ గా టైటిల్ ని “వీరసింహా రెడ్డి” ని లాంచ్ చేసుకోగా దీనికి భారీ స్పందన వచ్చింది.

ఇక ఇప్పుడు అయితే ఈ చిత్రం షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త యాక్షన్ షెడ్యూల్ తో ఈరోజు స్టార్ట్ చేశారట. మరి ఇది సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ యాక్షన్ బ్లాక్ కాగా దీనిలో అయితే బాలయ్య మరియు విలన్స్ మధ్య షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.

మరి ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని అయితే వచ్చే ఏడాది సంక్రాంతిలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు