రికార్డుల విధ్వంసం: గత ప్రపంచ కప్ కంటే 12 రెట్లు అధికంగా వీక్షణ సమయం! భారత్-పాక్ మ్యాచ్‌తో క్రికెట్ చరిత్రలో నయా ట్రెండ్

రికార్డుల విధ్వంసం: గత ప్రపంచ కప్ కంటే 12 రెట్లు అధికంగా వీక్షణ సమయం! భారత్-పాక్ మ్యాచ్‌తో క్రికెట్ చరిత్రలో నయా ట్రెండ్

Published on Oct 17, 2025 5:04 PM IST

womens-cricket

మహిళల క్రికెట్‌లో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య జరిగిన మ్యాచ్ ఒక చరిత్రను సృష్టించింది. వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) సందర్భంగా జరిగిన ఈ పోరుకు భారీ సంఖ్యలో అభిమానులు టీవీలకు, మొబైల్స్‌కు అతుక్కుపోయారు.

ఐసీసీ (ICC), జియో హాట్‌స్టార్ (Jio Hotstar) విడుదల చేసిన లెక్కల ప్రకారం, మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఇది రికార్డు అయ్యింది.

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ను దాదాపుగా 2.84 కోట్ల మంది (28.4 million) వీక్షించారు.

కేవలం ఒకే మ్యాచ్‌కి 187 కోట్ల నిమిషాల (1.87 billion minutes) పాటు వీక్షణ సమయం (Watch Time) నమోదైంది. ఇది మహిళల క్రికెట్ రికార్డులను బద్దలు కొట్టింది.

ఈ ఒక్క మ్యాచ్‌తో పాటు, టోర్నమెంట్‌కు కూడా ఆదరణ బాగా పెరిగింది.

ప్రపంచ కప్‌లో మొదట జరిగిన 13 మ్యాచ్‌లను కలిపి సుమారు 6 కోట్ల (60 million) వ్యూస్‌ వచ్చాయి.

మొత్తంగా ఇప్పటివరకు చూసిన సమయం (Total Watch Time) 700 కోట్ల నిమిషాలు (7 billion minutes) దాటింది. ఇది గత ప్రపంచ కప్‌తో పోలిస్తే ఏకంగా 12 రెట్లు ఎక్కువ.

ఇక, భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మరో ముఖ్యమైన మ్యాచ్‌ను కూడా 48 లక్షల మంది (4.8 million) వీక్షకులు చూశారు.

సెమీ-ఫైనల్స్‌కు చేరుకోవడానికి భారత జట్టు ఇంకా ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్‌లను కూడా అభిమానులు భారీగా చూసే అవకాశం ఉంది కాబట్టి, రాబోయే రోజుల్లో వ్యూయర్‌షిప్ రికార్డులు మరింత పెరగవచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు