ఏడాది తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆది పినిశెట్టి ‘శబ్దం’.. కానీ..!

ఏడాది తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆది పినిశెట్టి ‘శబ్దం’.. కానీ..!

Published on Mar 24, 2026 10:08 AM IST

Sabdham

ట్యాలెంటెడ్ నటుడు ఆది పినిశెట్టి నటించిన రివెంజ్ డ్రామా ‘శబ్దం’ 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ రెస్పాన్స్ లభించింది. దర్శకుడు అరివళగన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని హారర్, ఎమోషన్ అంశాలు ప్రేక్షకులను కొంతవరకు మెప్పించాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ అయిన ఏడాది అయినా, ఇంకా డిజిటిల్ ప్లాట్‌ఫార్మ్‌లలో స్ట్రీమింగ్‌కు రాకపోవడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి తగ్గిపోయింది.

కానీ, ఊహించని విధంగా ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఏడాది దాటిన తర్వాత ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రావడంతో ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. అయితే, ఓటీటీలో కేవలం తమిళ భాషలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రావడం తెలుగు ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. తెలుగు స్ట్రీమింగ్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని చాలా రోజులుగా ఎదురుచూసిన వారు ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఇప్పుడు జీ5లో వీక్షించే అవకాశం లభించింది. మరి కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ‘శబ్దం’ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు