‘దృశ్యం 3’ బాక్సాఫీస్ విధ్వంసం.. వారం రోజుల్లో 200 కోట్లు

‘దృశ్యం 3’ బాక్సాఫీస్ విధ్వంసం.. వారం రోజుల్లో 200 కోట్లు

Published on May 28, 2026 11:52 AM IST

Drishyam-3

మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ కలయికలో వచ్చిన అవైటెడ్ క్రేజీ థ్రిల్లర్ సీక్వెల్ సినిమానే దృశ్యం 3. ఇది వరకే వచ్చిన రెండు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ పార్ట్ గా వచ్చిన ఈ మూడో భాగం అభిమానులని అలరించి బాక్సాఫీస్ వద్ద ఒక బ్లాస్ట్ లా నిలిచింది.

అయితే ఒకింత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ లాల్, జీతూ కాంబినేషన్ ఊహించని నెంబర్స్ ప్రపంచ వ్యాప్తంగా సెట్ చేస్తుంది. ఇలా వారం రోజుల రన్ ని పూర్తి చేసుకున్న ఈ థ్రిల్లర్ చిత్రం కేవలం ఈ 7 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషనల్ హిట్ గా మారింది. ఓవర్సీస్ మార్కెట్, కేరళలో సినిమా వసూళ్లు, బుకింగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. దీనితో లాంగ్ రన్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు