విజయోత్సాహంలో అక్కినేని హీరో !

విజయోత్సాహంలో అక్కినేని హీరో !

Published on Dec 15, 2018 2:53 AM IST

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ చిత్రంలో సుమంత్ సరసన ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించింది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం గుడ్ మౌత్ టాక్ ను రోజురోజుకు డీసెంట్ కలెక్షన్స్ తో పుంజుకుంటూ ఇప్పటికే బాక్స్ ఆఫీసు వద్ద బ్రేక్ ఈవెన్ అయింది. దీంతో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.

కాగా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్న హీరో సుమంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో సక్సెస్ అంటే నిర్మాత పెట్టిన డబ్బులు వెనక్కి రావటమే..ఆ పరంగా చూసుకుంటే మా “సుబ్రహ్మణ్యపురం” పూర్తిగా విజయం సాధించినట్లే. మా నిర్మాత సుధాకర్ రెడ్డిగారు కూడా ఇప్పటికే కలెక్షన్స్ పరంగా కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. నేను చేసిన సినిమాల్లో నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చిన చిత్రాల్లో ఇదోకటి అని సుమంత్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు