సూపర్ స్టార్ రజినీ కాంత్ -శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.0 నిన్న విడుదలై బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక లింగ , కబాలి , కాలా చిత్రాలతో నిరాశ పరిచిన రజినీ మళ్ళీ ఈ చిత్రం తో ట్రాక్ లోకి వచ్చారు.
ఇక ఈ చిత్రం మొదటి రోజు ఏపీ మరియు తెలంగాణ లో రూ. 12.53 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ చిత్రం తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే రానున్న రోజుల్లో బాక్సాఫిస్ వద్ద ఇదే జోరును కొనసాగించాల్సిన అవసరం వుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రం యొక్క వసూళ్ల వివరాలు
ఏరియా | కలక్షన్స్ |
నైజాం | 4.73 కోట్లు |
సీడెడ్ | 1.98 కోట్లు |
నెల్లూరు | 0.73 కోట్లు |
గుంటూరు | 1.02 కోట్లు |
కృష్ణా | 0.730కోట్లు |
పశ్చిమ గోదావరి | 0.75 కోట్లు |
తూర్పు గోదావరి | 0.96 కోట్లు |
ఉత్తరాంధ్ర | 1.65 కోట్లు |
ఏపీ, తెలంగాణ లో మొదటి రోజు షేర్ | 12.53 కోట్లు |