‘2.0’ విడుదల తేదీ ఖరారు !

‘2.0’ విడుదల తేదీ ఖరారు !

Published on Jul 10, 2018 10:40 PM IST

‘రోబో’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘2. 0’ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ లు అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ముఖ్య పాత్రలు పోషించారు. దాదాపు సంవత్సరం పైనే అవుతుంది ఈ చిత్ర షూటింగ్ ముగిసి కానీ విడుదల తేదీని ప్రకటించక పోవడంతో అసలు ఈ చిత్రం ఈ ఏడాది విడుదలవుతుందా అని అనేక సందేహాలు రేకెత్తాయి.

ఇక ఎట్టకేలకు ఈ చిత్ర విడుదల తేదీని కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించాడు చిత్ర దర్శకుడు శంకర్. ఈ ఏడాది నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులముందుకు రానుంది ఈ చిత్రం. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు