టీజర్: జోడి- మైసూర్ పాక్ కోసం ఎవరైనా మైసూర్ వెళతారా?

టీజర్: జోడి- మైసూర్ పాక్ కోసం ఎవరైనా మైసూర్ వెళతారా?

Published on Jul 24, 2019 1:32 PM IST

ఇటీవల బుర్రకథ చిత్రంలో ఆది సాయికుమార్ రెండు భిన్న స్వభావాలున్న యువకుడిగా నటించిన అలరించారు. కాగా ఆయన తాజాగా నటించిన చిత్రం “జోడి”. జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా దర్శకుడు విశ్వంత్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ చిత్ర టీజర్ నేడు విడుదల చేయడం జరిగింది.

టీజర్ చూస్తుంటే మూవీ ప్రధానంగా కాలేజీ నేపథ్యంలో ఇద్దరు స్టూడెంట్స్ మధ్య నడిచే లవ్ స్టోరీగా అనిపిస్తుంది. శ్రద్ధా శ్రీనాధ్ ప్రేమ కోసం ఆమె వెంటపడే పాత్రలో ఆది కనిపిస్తున్నాడు.ఈ ఇద్దరు యంగ్ జోడి మాత్రం చాలా క్యూట్ గా ఉన్నారు. గొల్లపూడి మారుతి రావ్, వెన్నెల కిషోర్,సీనియర్ నరేశ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని భావన క్రియేషన్స్ బ్యానర్ పై పద్మజ మరియు సాయి వెంకటేష్ గుర్రం నిర్మిస్తుండగా, ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు