టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ను సైబ్రాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో నిఖిల్ చాలా మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. అయితే కరోనా సమయంలో నిఖిల్ చేసిన సేవలను గుర్తించిన సజ్జనార్ అతన్ని శాలువా కప్పి గౌరవించారు. ఈ సందర్భంగా నిఖిల్లోని మానవతా దృక్పతాన్ని సజ్జనార్ మెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సజ్జనార్ కష్టసమయంలో ఎంతోమందికి సాయం చేసిన నిఖిల్ చాలా మందికి స్పూర్తిగా నిలిచారని, కరోనా సెకండ్ వేవ్ సమ్యంలో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న చాలా మందికి నిఖిల్ సాయం చేసారని సజ్జనార్ అన్నారు. చాలా మందికి మెడికల్ కిట్స్తో పాటు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకున్నారని, ఎంతోమంది ప్రాణాలు కాపాడటానికి నిఖిల్ సాయపడ్డాడని సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు