నిఖిల్ తో కలిసి నటించనున్న నివేతా !

నిఖిల్ తో కలిసి నటించనున్న నివేతా !

Published on Oct 18, 2018 2:28 AM IST

‘కిరాక్ పార్టీ’ చిత్రం తరువాత యువ హీరో నిఖిల్ ప్రస్తుతం ‘ముద్ర’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కూడా రీమేకే కావడం విశేషం . తమిళ భాషలో విజయం సాధించిన ‘కనితన్’ చిత్రానికి రీమేక్ గా వస్తుంది ఈచిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది. టిఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నిఖిల్. కొత్త దర్శకుడు కిషన్ చెప్పిన కథ ఆయనకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడిగా నివేతా థామస్ ను తీసుకున్నారని సమాచారం. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రానున్నఈచిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు